*దారి మరమత్తుల కొరకై ప్రోసిడింగ్ అందజేసిన జువ్వాడి నర్సింగరావు*

*దారి మరమత్తుల కొరకై ప్రోసిడింగ్ అందజేసిన జువ్వాడి  నర్సింగరావు*

జనం న్యూస్ సెప్టెంబర్ 28, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు మొన్న ఇబ్రహీంపట్నం మండలంలోని వేముల కుర్తి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో గ్రామ ప్రజలు దసరా ఉత్సవాలలో భాగంగా జంబి కొట్టడానికి వెళ్లడానికి దారి సరిగా లేదు అని వర్షానికి కొట్టుకపోయి గుంతలుగా అయ్యిందని దానిని మరమ్మాత్తులు చేయించాలని గ్రామస్థులు కోరడం జరిగింది దానికి వెంటనే జువ్వాడి నర్సింగా రావు స్పందించి దసరా లోపు ఆ పనులను పూర్తి చేయాలని ఒక లక్ష 50 వేల రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకున్న జువ్వాడి నరసింగారావుకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి,ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగం గంగాధర్,కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి తరి రామానుజన్,బండి రాజేష్, వేములకుర్తి గ్రామ విడిసి చైర్మన్ ఎడిపల్లి గంగారెడ్డి, అరె రమేష్, ఎస్కెలా శ్రీనివాస్, దేవేందర్ మరియు వేములకుర్తి గ్రామస్తులు పాల్గొన్నారు..