దారుణం.. ఆస్తికోసం తండ్రిని చంపేసి ముక్కలు ముక్కలు నరికిన కొడుకు..

దారుణం.. ఆస్తికోసం తండ్రిని చంపేసి ముక్కలు ముక్కలు నరికిన కొడుకు..

జనం న్యూస్: ఆస్తి కోసం తన తండ్రినే కొడుకు హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుంద్ కాలనీలో ఉంటున్న మురళిధర్ గుప్తకు తన కొడుకు సంతోష్ కుమార్ గుప్త మధ్య గత కొన్నిరోజులుగా ఆస్తి వివాదం ఉంది. అయితే ఆస్తి కోసం తండ్రిని చంపడానికి కూడా వెనకాడలేదు కొడుకు.ఆదివారం రాత్రి మురళిధర్ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. అతనిపై తన కొడుకు సంతోష్ సుత్తెతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత కొడుకు సంతోష్ తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని ఓ సూట్ కేస్ లో కుక్కాడు. అనంతరం తమ ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో దాచిపెట్టాడు. విషయం తెలుసుకున్న సంతోష్ కుమర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరీర భాగాలను సేకరించిన పోలీసులు వాటిని పోస్టు మార్టానికి పంపించారు. సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.