నిరుపేదలకు ప్రజలకు వరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు తాజామాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ

నిరుపేదలకు ప్రజలకు వరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు తాజామాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ

ఎదుల్లాపూర్ మ్యాకల యాదిరెడ్డికి 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ పండ్ చెక్కు అందజేత...

 జనం న్యూస్ అక్టోబర్23.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 


ఆపదలో ఉండే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఒక వరమని ఎంపీపీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు, శివ్వంపేట తాజామాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. మండలంలోని ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన మ్యాకల యాదిరెడ్డికి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం అందజేశారు. ఈసందర్బంగా హరికృష్ణ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ యాదిరెడ్డి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ముఖ్య మంత్రి సహాయనిదికి దరఖాస్తు చేసుకోవడం జరిగినదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కూడ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు నల్ల బాలరాజ్, రంగీల ఆంజనేయులు, బానోత్ రాజు, బండారి శ్యామల వెంకటేష్, సీనియర్ నాయకులు లింగోజీగూడ నాగ్యారి యాదగిరి, మదన్ లాల్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.