పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

జనం న్యూస్ మే 23, (రిపోర్టర్ ప్రభాకర్) మన్యం జిల్లా ,కురుపాం మండలం జి.శివడ పంచాయతీ వేపమానుగూడ గ్రామంలో మంగళవారం ఉదయం ఓ గిరిజనుడు హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన పాలక ఇండియా (30) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో దారుణంగా చంపబడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఎల్విన్పేట సి.ఐ సత్యన్నారాయణ, కురుపాం, నీలకంఠాపురం ఇన్ఛార్జ్ ఎస్.ఐ.షణ్ముఖరావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.