*పూడి ఆర్అండ్ఆర్ కాలనీ స్కూల్లో మహత్మ గాంధీ విగ్రహం ఆవిష్కరణ*

*పూడి ఆర్అండ్ఆర్ కాలనీ స్కూల్లో మహత్మ గాంధీ విగ్రహం ఆవిష్కరణ*

ఉచిత మెగా రక్తదానం,వైద్య శిబిరానికి విశేష స్పందన*

 

అచ్యుతాపురం(జనం న్యూస్):జాతిపిత మహాత్మాగాంధీ155 వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వైఎస్ఆర్ నగర్ పూడి ఆర్అండ్ఆర్ కాలనీలో ఎంపీయూపీ స్కూల్లో మహత్మ గాంధీ విగ్రహం ఆవిష్కరణతో పాటు మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సెక్రటరీ,స్థానిక నాయకులు మరియు గాంధీ సేవా సమితి యువకులు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా యూత్ సభ్యులు రాజాన సంజీవ్ మాట్లాడుతూ యువత ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచి విషయమని, రక్త దానం ప్రాణదానంతో సమానం అన్నారు.

సుమారు 100 మంది యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్త దానం చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో

రాజాన సంజీవి బృందం, నరేందర్,రంజిత్, కాసు,రాజాన కార్తీక్,శివ,లాలం నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.