మార్చ్ 1వ తేదీ నుంచి రూ.2వేల నోట్లు బ్యాన్.. కొత్త 1000 రూపాయల నోట్లు నిజమేనా..

మార్చ్ 1వ తేదీ నుంచి రూ.2వేల నోట్లు బ్యాన్.. కొత్త 1000 రూపాయల నోట్లు నిజమేనా..

జనం న్యూస్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చ్ 1వ తేదీ నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాన్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. మార్చ్1 నుంచి కొత్త వెయ్యి రూపాయల నోట్లు వస్తాయని, 2వేల రూపాయల నోట్లు బ్యాంకులో ఇచ్చేయాలంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, వీడియోలు వస్తున్నాయి అవన్నీ నిజాలు కాదు. వాటిని ఎవరు నమ్మవద్దు అలాంటి వీడియోలు, వార్తలు, మెసేజ్లు వస్తే నమ్మి వాటిని ఫార్వర్డ్ చేయకండి అని PIB ఫ్యాక్ట్ చెక్ సూచించింది.