రాజస్థాన్ కు చెందిన సైబర్‌ నేరస్థుడు అరెస్టు

రాజస్థాన్ కు  చెందిన  సైబర్‌ నేరస్థుడు అరెస్టు

జనం న్యూస్ 16 సెప్టెంబర్ 2024  జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:- దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగుల్లో  ప్రజలను నమ్మించి కోట్లల్లో సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ కు చెందిన   సైబర్‌ నేరగాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరీటీ బ్యూరో వరంగల్‌ కమిషనరేట్‌ విభాగానికి చెందిన వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం రాత్రి  అరెస్టు చేసారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసిపి విజయ్‌కుమార్‌ వివరాలను వెల్లడిస్తూ  రాజస్థాన్ రాష్ట్రం దేగానా పట్టణానికి  చెందిన కాలు రామ్ (33)  గత కొద్ది రోజులగా ఆన్ లైన్ లో పెట్టుబడి పెడితే అధిక  వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బును తిరిగి పొందవచ్చని   దేశ వ్యాప్తంగా ప్రజలను నమ్మించి మోసం చేసి కోట్లల్లో డబ్బు కొల్లకొడుతున్న ఈ సైబర్ నేరగాడు దేశ వ్యాప్తంగా పన్నెండుకు పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో రెండు నేరాలకు పాల్పడ్డాడు. నిందితుడు. ఈ సైబర్ నేరస్తుడు  ఇటీవల హనుమకొండ ప్రాంతానికి ఓ ప్రముఖ వైద్యుడుని నమ్మించి అతని ద్వారా ఆన్ లైన్ లో 21 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు.  సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్లుగా గుర్తించిన  సదరు బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించగా సైబర్  సెక్యూరిటీ బ్యూరో అధికారుల ఉత్తర్వుల మేరకు  సైబర్ క్రైమ్  ఏసీపీ విజయ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో   పోలీసులకు అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని వినియోగించుకోని నిందితుడి అచూకీ కనుగోని ప్రత్యేక సైబర్ బృందం పోలీసులు  నిన్నటి రోజున  నిందితుడిని రాజస్థాన్ లో  అరెస్టు చేసి వరంగల్‌ కమిషనరేట్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్‌ ఏసిపి విజయ్‌కుమార్‌, ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్‌.ఐలు చరణ్‌, శివకుమార్‌, ఏ.ఏ.ఓ సల్మాన్‌ పాషా,, కానిస్టేబుళ్ళు కిషోర్ కుమార్, అంజనేయులు, రాజుతో పాటు ఇతర సైబర్ విభాగం సిబ్బందిని  పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అభినందించారు.