*నూతన ఎంఈఓ బాధ్యతల స్వీకరించిన పత్తిపాటి నివేదిత*

*నూతన ఎంఈఓ బాధ్యతల స్వీకరించిన పత్తిపాటి నివేదిత*

(జనం న్యూస్) సెప్టెంబర్ 26 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్:-ఎన్నో ఏళ్లుగా ఇన్చార్జి వ్యవస్థతో అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీనియారిటీ ప్రతిపాదికన నూతనంగా ఎంఈఓ లను నియమించడం జరిగింది, ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న పత్తిపాటి నివేదిత ఎంఈఓ గా బుధవారం నాడు బాధ్యతలు చేపట్టారు, ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ బడులపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా మండల పరిధిలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఏదైనా పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఈ సందర్భంగా నూతన విద్యాశాఖ అధికారిని పలువురు శుభాకాంక్షలు తెలిపారు..