ఫుల్లుగా మందేసి ఆర్టీసీ డ్రైవర్ను కండెక్టర్ను చవాకట్టిన యువకులు.. హారన్ కొట్టాడని దాడి.

జనం న్యూస్: ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదారు ముగ్గురు యువకులు. ఎంజీబీఎస్ నుంచి అమీర్ పేట్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంజే మార్కెట్ వద్ద బస్సు ద్విచక్రవాహనం పక్కనుంచే వెళ్లడంతో… ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సుకు అడ్డం వచ్చి బస్సును ఆపేశారు. బస్సు డ్రైవర్ లక్ష్మణ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డువచ్చిన కండక్టర్ అంజమ్మను తోసివేశారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు…ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీ లో ఉన్నట్లు బేగం బజార్ సీఐ తెలిపారు. ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.