రోడ్డుపై అడ్డంగా పడ్డపోయిన చెట్లు

రోడ్డుపై అడ్డంగా పడ్డపోయిన చెట్లు

దొంతి - గుండ్లపల్లి మధ్యలో పౌల్ట్రీ పామ్ వద్ద నడిరోడ్డుపైకి ఒరిగిన చెట్లు..

పట్టించుకొని అధికారులు...
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

 జనం న్యూస్ అక్టోబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

 మెదక్ జిల్లా శివంపేట  మండలంలోని ఇటీవలే కురిసిన ఈదురు గాలులు, గాలివానా భీభత్సనికి మండలంలోని దొంతి - గుండ్లపల్లి మార్గంలో నడిరోడ్డుపై చెట్లు, పొదలు పడిపోవడంతో వాటిని తొలగించిన నాథుడే కరువయ్యారు. దొంతి వాగు దాటిన గుండ్లపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గల కోళ్లపారం వద్ద నడిరోడ్డుపై చెట్లు పడటంతో కొంతాన్ పల్లి, గుండ్లపల్లి, దంతాన్ పల్లి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నడి రోడ్డుపై చెట్లు పడిపోయి ఇన్నిరోజులు కావస్తున్న గాని సంబంధిత అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్పందించి చెట్లను తొలగించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి దొంతి - గుండ్లపల్లి గ్రామాల మధ్యలో రోడ్డుపై పడిపోయిన చెట్లను తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.