సర్దార్ తాండ విద్యార్థులతో మధ్యాహ్న భోజనాన్ని భుజించు చున్న ఎంపీడీవో సత్తయ్య,

సర్దార్ తాండ విద్యార్థులతో మధ్యాహ్న భోజనాన్ని భుజించు చున్న ఎంపీడీవో సత్తయ్య,

జనం న్యూస్,సెప్టెంబర్ 27,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని సర్దార్ తాండ గ్రామ పంచాయతీలోని 

ఎంపీపీ ఎస్ పాఠశాలను శుక్రవారం అకస్మాత్తుగా పర్యవేక్షించిన ఎంపీడీవో సత్తయ్య,ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం విద్యార్థిని,విద్యార్థుల సంఖ్య 71 మంది ఉండగా,51 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించి చూశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో సహా పంక్తి భోజనం చేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు సాయి కృష్ణ,నరేష్, పనిచేస్తున్నారని అన్నారు.పాఠశాల తరగతి గదులను, పాఠశాల ఆవరణాన్ని, పరిశుభ్రంగా ఉంచారని అన్నారు.అనంతరం  

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు.పిల్లలు తక్కువగా ఉండడంతో కారణమేమిటని అంగన్వాడి టీచర్ను ఆయాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని పురవీధులను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో వీక్షించి ఈ కార్యక్రమంలో

పంచాయతీ కార్యదర్శి సంతోష్,గ్రామ యువకులు స్వరూప్చంద్,భరత్, తదితరులు పాల్గొన్నారు.