స్కూటీ పై ప్రేమజంట పాడుపని.. చీ.. చీ అంటున్న నెటిజన్లు. (వీడియో చూడండి)

జనం న్యూస్: ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో వెకిలి చేష్టలకు పాల్పడ్డం ఎక్కువయిపోయింది. కొన్ని ప్రేమ జంటలు పబ్లిక్‌గా బరితెగించేస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రేమ జంటల ఆగడాలకు సంబంధించిన సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉ‍న్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ ప్రేమ జంట ఢిల్లీ మెట్రోలో బరితెగించి ప్రవర్తించింది. అందరి ముందే ముద్దుల్లో మునిగిపోయింది. ఈ సంఘటన మరువక ముందే ఢిల్లీలో మరో సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రేమ జంట స్కూటీపై వింతగా కూర్చుని ప్రయాణించింది. ప్రమాదం అని తెలిసినా హద్దులు మీరి ప్రవర్తించింది. పూర్తి వివరాల్లోకి వెళితే. ఢిల్లీకి చెందిన ఓ ప్రేమ జంట కొద్దిరోజుల క్రితం స్కూటీపై రోడ్డుపై ‍ప్రయాణిస్తూ ఉంది. అది రాత్రి బాగా పొద్దుపోయిన సమయం. ఆ ప్రేమికులు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని కూర్చున్నారు. వాళ్లు అలా కూర్చుని ప్రయాణించటం ప్రమాదం అని తెలిసినా.. వారి ముందు వాహనాలు వెళుతున్నాయని తెలిసినా.. వాళ్లు పట్టించుకోలేదు. కొంత దూరం అలాగే ప్రయాణించారు. ఓ చోట ఒకే సారి రెండు మూడు వాహనాలు రావటంతో ప్రేమ మైకం లోంచి బయటకు వచ్చారు. వెంటనే చేతులు విడిచిపెట్టేశారు. తర్వాత సాధారణ స్థితిలో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ ప్రేమికులు భుజాలపై చేతులు వేసుకుని ప్రయాణించటాన్ని వారి వెనకాల ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.తర్వాత ఆ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మెట్రో రైల్లో చోటు దొరకలేదా ఏంటి?.. ఇలా స్కూటీపై బరి తెగించారు’’.. ‘‘ స్కూటీ మీద ఏంటి బాబు ఇది.. మెట్రోలో అయితే మంచిగా ఏసీ ఉంటుంది కదా!’’.. ‘‘ ఢిల్లీ ప్రేమికులు ఈ మధ్య బాగా బరితెగించేస్తున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.