కోటబొమ్మాళి ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడిరప చేస్తాయి.

కోటబొమ్మాళి ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడిరప చేస్తాయి.

మంత్రి అచ్చెన్న చొరవతో రాష్ట్ర పండగలుగా కొత్తమ్మతల్లి ఉత్సవాలు

జనం న్యూస్26 సెప్టెంబర్ శ్రీకాకుళం జిల్లాకోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడిరప చేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కళింగవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు అన్నారు. గురువారం ఆయన విలేకర్లుతో మాట్లాడుతూ మొనుపెన్నడులేని విధంగా స్థానిక శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో రాష్ట్ర పండగలుగా నిర్వహిస్తుండడం మా మండల ప్రజలకకు గర్వకారణమన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్సవాలను వచ్చి నెల 1 నుంచి 3వ తేదీవరకు జరగనున్న కొత్తమ్మతల్లి 

ఉత్సవాలను జిల్లా కలెక్టర్‌, ఎస్సీ ఇతర అధికారుల సమన్వయంతో అంగరంగవైభవంగా నిర్వహించేదుకు గాను ఇటీవల రెండుమూడు పర్యాయాలు స్థానిక పెద్దలతో సమీక్ష సమావేశాలు నిర్వహించటం జరిగిందని అయితే ఇప్పటికే విద్యుత్‌ అలంకరణలు, రోడ్డు పునఃనిర్మాణం పనులు, ఆలయానికి పెయింటింగ్‌లు పూర్తి అయ్యాయని, ఉత్సవాలు కు వచ్చిన భక్తులకోసం ఉచిత అన్నదానం, ప్రసాధాల నిర్వహాణ కోసం ఏర్పాట్లు, అన్ని సాంస్కృతిక, సాంఫీుక, పగటి వేషాలు, కబాడీ తో పాటు ఎప్పటి కప్పుడు పారిశుద్య పనులు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఉత్సవాలు నేపద్యంలో ఇప్పటికే కోటబొమ్మాళిలో పండగ వాతావారణాన్ని తలపించేవిధంగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అయితే వచ్చిన భక్తులతో పాటు స్థానికులు కూడా అన్ని విధాల సహాయం సహకారాలు అందిస్తూ సుధీర్ఘ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులకు మన కుటుంబ సభ్యులులా ఆదరించాలని, సాగనంపాలని ఆయన గ్రామస్థులను కోరారు. కోటబొమ్మాళి గౌరవాన్ని, మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిష్టాలకు ఎటువంటి భగం కలగకుండా అందరి సహాయ సహకరాలు అందించాలని గోవిందరాజులు కోరారు.