నడి రోడ్డుపై ప్రియురాలిని కత్తితో పొడిచేసిన కాంగ్రెస్ నేత..! ఆ తరువాత..! (వీడియో చూడండి)

జనం న్యూస్: యువజన కాంగ్రెస్ నాయకుడు తన ప్రియురాలిని కత్తితో పొడిచాడు. ఆమె తనను మోసం చేసిందని ఆరోపించాడు. నీకు ఎంత మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు? అని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో ఈ సంఘటన జరిగింది. కేసర్‌పురాకు చెందిన 23 ఏళ్ల కుల్దీప్ వర్మ యువజన కాంగ్రెస్ నాయకుడు. బుధవారం మధ్యాహ్నం నీముచ్‌లోని ఒక పార్క్‌ వద్ద 20 ఏళ్ల యువతితో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో తన వద్ద ఉన్న కత్తితో ఏడుసార్లు ఆమెను పొడిచాడు. ఆ యువతి తనను ప్రేమించి మోసం చేసిందని ఆరోపించాడు. ఈ అమ్మాయిలకు డబ్బు కావాలి అంటూ గట్టిగా అరిచాడు. 'నువ్వు నన్ను వదిలేసావు. మీకు ఎంత మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు? అయాన్, ర్యాన్, ఆజాద్, హర్షిత్' అంటూ రంకెలు వేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, తీవ్రంగా గాయపడిన ఆ యువతి నేలపై పడి బాధతో విలవిలలాడిపోయింది. అయితే ఎవరూ కూడా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆ యువతిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మరోవైపు యువతిపై కత్తితో దాడి చేసిన నిందితుడైన కుల్దీప్ వర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.