మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్కు రూ.2,200 చెల్లింపు..!!.

మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్కు రూ.2,200 చెల్లింపు..!!.

జనం న్యూస్ 17 అక్టోబర్ 2024  జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంటరైన మిల్లర్లు లోకల్గా కమీషన్ ఏజెంట్లను నియమించుకొని వడ్ల సేకరణ
ఇంకా షురూ కాని సర్కారు సెంటర్లు రూ.500 బోనస్ లబ్ధికి అన్నదాతలు దూరమయ్యే చాన్స్ కొనుగోళ్ల టార్గెట్ చేరడంఈసారి కూడా అనుమానమే నిజామాబాద్ : జిల్లాలో వరి పంట కోతలు మొదలై 20 రోజులు దాటింది. ఇంకా సర్కార్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోయినా.. మిల్లర్లే నేరుగా కల్లాల మీదకు వచ్చి జోరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్ వచ్చిన వడ్లలో ఇప్పటికే 35 శాతం వరకు కొన్నట్టు తెలుస్తోంది. కల్లాల వద్దకు ఏజెంట్ల సహాయంతో చేరుకొని సన్నాలు, దొడ్డురకం తేడాలేకుండా పచ్చివడ్లను క్వింటాల్కు రూ.2,200 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్ధతు ధరకు దాదాపు సమానంగా మిల్లర్లు రేట్ఇస్తుండడంతో రైతులు వారివైపే మొగ్గుచూపుతున్నారు. సన్న వడ్లకు ఈసీజన్ నుంచి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని పాలకులు నిర్ణయించారు. కానీ, మిల్లర్ల కల్లాల దగ్గరే కొంటుండంతో రైతులు ముందుగానే అమ్మేసుకుంటున్నారు. దీంతో వారు బోనస్ నష్టపోవాల్సి వస్తోంది. వరుసగా మూడో సీజన్ జిల్లాలో సాగు భూమి విస్తీర్ణం 5.53 లక్షల ఎకరాలుకాగా రెండేండ్ల నుంచి వరిసాగు అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 4.30 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. అందులో సన్నరకం వరి పంట 4.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 28 వేల ఎకరాలలో మాత్రమే దొడ్డురకం పంట ఉంది. 'ఏ'గ్రేడ్ వడ్లకు ప్రభుత్వమద్దతు ధర క్వింటాల్కు రూ.2,320, కామన్ రకం సన్నాలకురూ.2,300 రేట్ కొనసాగుతోంది. మద్ధతు ధరకు అదనంగా రూ.500 బోనస్ను ప్రకటించింది. వెరసి క్వింటాల్వడ్లకు కలిపి మొత్తం రూ.2,800 రేట్ దక్కే అవకాశం ఉండటంతో జిల్లా రైతులు ఈసారి సన్న రకం వరి సాగు చేశారు. అయితే 2023--24 ఖరీఫ్, యాసంగిలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మిల్లర్లు జిల్లాలో పండిన వడ్లను భారీగా కొనుగోలు చేశారు. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రాలలో వరిసాగు దెబ్బతినడంతో తెలంగాణకు వచ్చారు. ఈసారి కర్నాటక, ఆంధ్రప్రదేశ్ స్టేట్మిల్లర్లతోపాటు నల్గొండ, కోదాడ, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల నుంచి 20 రోజుల కిందే వచ్చిన మిల్లర్లు జిల్లాలో వడ్లు కొనుగోళ్లు షురూ చేశారు. పచ్చివడ్లకు మొదట్లో క్వింటాల్కు రూ.2,450 చెల్లించి ప్రస్తుతం రూ.2,200 ఇస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలుస్తోంది. క్వింటాల్ వడ్లకు రూ.30 కమీషన్పై గ్రామాలల వారీగా ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో సర్కారు కొనుగోళ్ల లక్ష్యం దెబ్బతింటోంది. అంకెలు.. సంఖ్యలు దాటని ఆఫీసర్ల ప్రణాళిక; ఈ ఖరీఫ్లో జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన ఆఫీసర్లు, అందులో 8 లక్షల టన్నులు 629 సర్కారు సెంటర్స్ఏర్పాటు చేసి కొనాలని ప్రణాళిక రూపొందించారు. సన్నరకం వడ్ల కోసం 465, దొడ్డురకానికి 164 సెంటర్లను ఓపెన్ చేస్తామని ప్రకటించారు. దసరా పండగ దాటినా ఇంకా సెంటర్లు తెరవలేదు. వడ్లు నింపడానికి కావాల్సిన 1.20 కోట్ల గన్నీ బ్యాగులు, టర్పాలిన్లు ఇంకా జిల్లాకు చేరలేదు. ప్రభుత్వ సెంటర్లు ఓపెన్ అయితే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ అంది ఆర్థికంగా లాభం పొందుతారు. బస్తాకు 3 కిలోల తరుగు తీసున్నా మిల్లర్లు చెల్లిస్తున్న రేట్ కాస్త పరవాలేదనుకున్నా రైతులు బోనస్ మాత్రం నష్టపోతున్నారు. పైగా ప్రభుత్వ కొనుగోళ్ల టార్గెట్కు కూడా పెద్ద దెబ్బే. వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డులకు సన్నబియ్యం అందించాలనే సర్కారు నిర్ణయంపై కూడా ఇది ప్రభావం చూపుతుందని అంటున్నారు.