వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన వైస్ ఎంపీపీ

వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన వైస్ ఎంపీపీ

జనం న్యూస్, పార్వతీపురం మన్యం, కొమరాడ, తేదీ సెప్టెంబర్ 21, (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  శత్రుచర్ల పరీక్షీత్ రాజు కు కొమరాడ మండల వైస్ ఎంపీపీ నంగి రెడ్డి శరత్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన స్వగ్రృహం లో కొమరాడ మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైస్ యం.పి.పి నంగి రెడ్డి శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో మరింత సైనికులు వలె కార్యకర్తలు నాయకులు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైసీపీ పార్టీ గత ఐదు సంవత్సరాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ప్రజలు ఎన్నడు చిరస్థాయిగా వైసీపీ పార్టీని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నంగి రెడ్డి శ్రావణ్ కుమార్, తొడుము సర్పంచ్ యేగిరెడ్డి సింహాచలం ఉన్నారు.