ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం

పులివెందుల శాసనసభ్యులు జగన్ మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే నిర్ణయం చాలా మంచిది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కొంత మినహాయింపు ఇస్తుంది.

అయితే పులివెందుల శాసనసభ్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి నమ్మకం లేని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సమక్షంలో కాకుండా, వారు నమ్మి ప్రార్థించే ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, వారికి నా అభ్యర్థన.

లేదా తిరుమలలోనే చెయ్యాలని నిర్ణయించుకుంటే, వారు సతీ సమేతంగా "శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నవి" అని అంగీకరిస్తూ సంబంధించిన పత్రాల మీద ఇరువురూ సంతకం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలని స్వామి వారి సమక్షంలో, భక్తులకి సంతృప్తి కలిగే విధంగా స్వీకరించాలని, ఒక సాధారణ హిందువుగా నా మనవి.

నా అభ్యర్థన సముచితము. ఎన్ వీరం చౌదరి