మహిళను చెట్టుకు కట్టేసి.. రాళ్ళతో దాడి..! తెలంగాణాలో ఘటన..ఎందుకంటే..!

మహిళను చెట్టుకు కట్టేసి.. రాళ్ళతో దాడి..! తెలంగాణాలో ఘటన..ఎందుకంటే..!

జనం న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ దుకాణంలో దొంగతనం చేసిన మహిళను కరెంట్ పోల్‌కు కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దార్ నగర్‌లో జగిత్యాల శిరీష అనే మహిళ పాన్ షాపులో దొంగతనం చేస్తుండగా పట్టుబడింది. అయితే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మహిళ ప్రజలపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేసి ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.